అసని(Asani) తుపాను ప్రభావంపై సంబంధిత శాఖ అధికారులు, ఎస్పీలు, కలెక్టర్లతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. తుపాను బలహీనపడటం ఊరటనిచ్చే అంశమన్న సీఎం.. తుపాను ప్రభావిత కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్(CM Jagan) సమీక్ష నిర్వహించారు. తుపాను దృష్ట్యా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు ఆదేశాలు జారీ చేశారు. తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నిర్లక్ష్యానికి అవకాశముండకుండా అధికారులు సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అవసరమైన చోట సహాయ, పునరావాస శిబిరాలు ఏర్పాటు చేయాలని సీఎం జగన్ అన్నారు. అంతే కాకుండా సహాయ శిబిరాలకు తరలించిన వ్యక్తికి రూ.1000, కుటుంబానికి రూ.2వేలు చొప్పున ఇవ్వాలని సీఎం ఆదేశించారు.
COMMENTS