గత 8 నెలలుగా ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీజీఎల్బీ, జీపీఎఫ్, మెడికల్ రీ యింబర్స్ మెంట్ తో పాటు పెన్షనర్లకు గ్రాట్యుటీ, ఇతర ప్రోత్సాహకాలు చెల్లింపులు జరగలేదు. దీంతో పాటు ప్రభుత్వం గత ఏడాది విడతల వారీగా డీఏ బకాయిలను తీరుస్తామని ప్రకటించింది. ఉద్యోగుల కోర్కె లు న్యాయపరమైనవే అయినప్పటికీ ఇవన్నీ నెరవేరాలంటే తలకు మించిన భారమవుతుందని ఆర్థికశాఖ అంచనాలు వేస్తోంది. అయితే ఒకే విడత అన్నిరకాల చెల్లింపులు జరపా లని తాము డిమాండ్ చేయటంలేదని ముందుగా ఓ నిర్ణయం తీసుకుని ఆపై షెడ్యూల్ ప్రకటిస్తే ఉద్యోగులకు వెసులుబాటు కలుగుతుందని జేఏసీల నేతలు వాదిస్తున్నా ఉద్యోగ సంఘాల డిమాండ్లలో భాగంగా కోవిడ్ కార మృతిచెందిన ఉద్యోగుల కుటుంబాల్లో ఒకరికి కారు ణ్య నియామకాల ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణ యించింది. అయితే ఇందులో విధి నిర్వహణలో సహజ మరణం పొందిన వారి కుటుంబాలకు కూడా అమలు చేయాలని ఉద్యోగ సంఘాలు పట్టుపడుతున్నాయి.
COMMENTS